తెలంగాణ

మహిళలకు కొండంత అండగా సఖి కేంద్రం

Sakhi Centre: నిస్సాయ స్థితిలో ఉన్న మహిళలకు కొండంత ధైర్యం నింపి అండగా నిలబడాల్సిన సఖి సెంటర్ ఆపదలో ఉండి సహాయం కోసం వచ్చిన మహిళల ను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అక్రమ సంపాదన ధ్యేయంగా మహిళల జీవితాలను పణంగా పెడుతున్న ములుగు సఖి సెంటర్ నిర్వాహకుడి అక్రమాలపై రాజ్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ..

ములుగు జిల్లాలోని సఖి సెంటర్ నిర్వాహణ బాధ్యతలు పీస్ ఫర్ ఆల్ నేషన్ అనే సంస్థ సీఈవో కొయ్యల సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలు అప్ప చెప్పడం జరిగింది. దానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం పీస్ ఫర్ ఆల్ నేషన్ అనే సంస్థకి ఆర్థిక సహాయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చెల్లించడం జరుగుతుంది. సఖి సెంటర్ నిర్వాణ బాధ్యతలు తీసుకున్న ఎన్జీవో దానికి కావాల్సిన కొంత మంది సిబ్బందితో పాటు మహిళలకు సహాయం అందించేందుకు లీగల్ అడ్వైజర్ నీ నియమించుకొని బాధిత మహిళలకు అండగా నిలబడి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలి. దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం చెల్లిస్తుంది.
కానీ సహాయం అందించాల్సిన కేంద్రం.. శరణార్థులైన మహిళలకు న్యాయం చేసేందుకు సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.. కానీ ములుగు జిల్లా సఖి సెంటర్ మాత్రం బాధిత మహిళల ఆశలను చిద్రం చేస్తోంది. బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన నిర్వాహకుడు కొయ్యల సాల్మన్ రాజు.. ఆయనే ఇప్పుడు మహిళల కష్టాలకు మూలంగా మారాడని ఆరోపణలు వస్తున్నాయి.

ములుగు సఖి సెంటర్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న సాల్మన్ రాజ్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సహాయం కోరుతూ వచ్చిన బాధిత మహిళల భర్తల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వరంగల్ జిల్లా ఖానాపురం గ్రామానికి చెందిన భార్య భర్తల సమస్య క్లియర్ చేసి భార్య నుండి విడాకులు వచ్చేలాగా చేస్తానని ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఒప్పందం చేసుకున్నాడు. కొంత డబ్బులు తీసుకుని కేసు విషయంలో అశ్రద్ధ చేస్తున్నాడని గట్టిగా అడగటంతో వారిపైనే తప్పుడు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేశాడు..

సఖి సెంటర్ నిర్వాహకుడి మహిళల సమస్యలను అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పలు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బాధిత మహిళల కేసు ఫైళ్లను కూడా దొరకకుండా చేస్తుండటంతో మహిళలకు రావాల్సిన మెయింటినెన్స్, రాకుండా పోతుందని కావాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కాంప్రమైజ్ అయ్యే విధంగా ఒత్తిడి తీసుకు వస్తున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఇలాంటి వ్యక్తి వల్ల ఎందరో మహిళలకు అన్యాయం జరుగుతుందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ఇది నిస్సయ మహిళల హక్కులను కించపరిచే చర్య, సఖి సెంటర్ నిర్వాహకుని వేధింపులు పెరిగిపోతున్నాయి . బాధిత మహిళలు జిల్లా పీస్ ఫర్ ఆల్ మిషన్ సీఈవో సాల్మన్ రాజ్ పై కలెక్టర్, DWO కి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సొమ్ముతో సఖి సెంటర్ నిర్వహిస్తు ప్రభుత్వ లక్ష్యాన్ని గండి కొడుతున్న సాల్మాన్ రాజుపై చర్యలు తీసుకోవాలని బాధితు మహిళలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button