తెలంగాణ
KTR: కాంగ్రెస్ చేసింది గోరంత.. చెప్పేది కొండంత

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసింది గోరంత, చెప్పేది కొండంత అన్నారు. మిస్ వరల్డ్ ఫ్లెక్సీలో రేవంత్ , భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు ఉన్నాయని వీరిలో ఎవరు మిస్ వరల్డో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్.
కమీషన్లు దండుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. చేయి తడపందే ఫైలు కదలదని స్వయంగా మంత్రి కొండా సురేఖనే చెప్పిందని వెల్లడించారు. కేసీఆర్ వరంగల్కి కదలగానే రేవంత్ కి భయం పట్టుకుందన్నారు. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారని కేటీఆర్ వెల్లడించారు.