తెలంగాణ
KTR: ఫార్ములా ఈ-కారు రేసింగ్లో కేటీఆర్కు ఈడీ నోటీసులు..

KTR: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 7 జనవరి, 2025న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎమ్ డీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు అందచేసింది. వారిద్దరినీ జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని చెప్పింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద వారిని ఈడీ విచారణ చేయనుంది.