తెలంగాణ
KTR: నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్

KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ ఈరోజు కేటీఆర్ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ.. ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్ర యించారు.
ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే.. విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులిచ్చింది. దీంతో.. ఈరోజు జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ.. ఈడీ కేటీఆర్కు సమన్లు జారీ చేసింది.