KTR: అది ఒక లొట్టపీసు కేసు.. వాడో లొట్టపీసు ముఖ్యమంత్రి

KTR: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కేసుకు సంబంధించి.. అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2001 లో పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులు కంటే ఇప్పుడు ఉన్నది ఇబ్బందే కాదు. రాష్ట్రంలో 3డి పాలన నడుస్తుంది… డిసెప్షన్, డిస్టాక్షన్, డిస్ట్రాక్షన్.. తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు 2,500 స్కీమ్ అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారు.
2025లో రైతుభరోసా విషయంలో రేవంత్ మోసాన్ని ఇంటింటికీ వెళ్లి మనం రైతులకు చెప్పాలి. రుణమాఫీ విషయంలో ప్రతీ దేవునిపై ఒట్లు పెట్టారు.. కౌలు రైతులకు భరోసా ఏమయింది? ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తున్నారు.. వారికి రైతు భరోసా కట్ చేస్తారట.. ఉద్యోగులకు, పెన్షనర్ల ను మోసం చేస్తున్నారు. మేడిగడ్డకు పర్రె కాదు.. రేవంత్ బుర్రకు పర్రె పట్టింది. ఈ కేసులో రూపాయి అవినీతి జరగలేదు. ఈ సం. సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు, కొత్త అధ్యక్షుని ఎన్నిక ఉంటాయి. త్వరలో 32 జిల్లాల్లో పార్టీ శిక్షణ కార్యక్రమాలు.. తెలంగాణ ప్రయోజనాలే BRS కు ముఖ్యం.. ఉమ్మడి రాష్ట్రంలో నే బాగుండె అని సీఎం మాట్లాడుతున్నారు. 2025ను పోరాటనామ సంవత్సరంగా ముందుకు వెలుదాం అని కేటీఆర్ పేర్కొన్నారు.