తెలంగాణ
Krishnaiah: కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఫైర్

Krishnaiah: కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఫైరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 58 ఏళ్ళు ఉన్న విరమణ వయసును 61 ఏళ్లకు పెంచి , నిరుద్యోగుల పొట్ట గొట్టారని విమర్శించారు.
నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి , నిరుద్యోగులను అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.