ఆంధ్ర ప్రదేశ్
కోట వినూత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం

శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్చార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చే అవకాశముంది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. శ్రీకాళహస్తి కూటమి నేతలకు సమన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది.



