Kodi Pandelu: కాలు దువ్వుతున్న పందెం కోళ్లు

Kodi Pandelu: ఆంధ్రుల పెద్ద పండుగ సంక్రాంతికి జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా కోస్తా జిల్లా కోడి పందేలకు పెట్టింది పేరు అని చెప్పొచ్చు. ఇక.. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తొలి సంవత్సరం కావడంతో.. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రతినిధులు తమ పట్టు పెంచుకునేందుకు కోడిపందాల నిర్వాహణను కూడా ఒక మార్గంగా ఎంచుకున్నారు. అయితే.. ప్రతిసారి పందాల నిర్వాహణను అడ్డుకుంటామని పోలీసులు, ప్రభుత్వం హెచ్చరిస్తుంది. పండగ మూడు రోజులు సాంప్రదాయం పేరుతో పందాల నిర్వహణ గోదావరి జిల్లాలో జరుగుతోంది. దీనికోసం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పందెం పుంజులని ప్రత్యేకంగా పెంచుతారు. వీటికి తర్ఫీదు ఇవ్వడం కూడా ఒక కల.
సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కోడిపందాలతో గ్రామీణ ప్రాంతాలు కలకలాడుతూ ఉంటాయి. కోడిపందాలు అనేవి సంక్రాంతి సమయంలో సాంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. నిబంధనల ప్రకారం కోడిపందాలు నిర్వహించరాదు. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు విధించినా.. పండుగ మూడు రోజులు కోడి పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు నిర్వాహకులు సమయతమవుతారు. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలోని ముమ్మిడివరం, ఐపోలవరం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తారు.
ఇక.. కోడిపందాల్లో ఉపయోగించే కోడిపుంజులను ప్రత్యేకంగా పెంచుతారు. వాటికి అనేక రకాల తర్ఫీదు ఇస్తారు. ఈ కోడి పందాలకు సంబంధించి అనేక జాతుల కోడి పుంజులను దాదాపు ఏడాదంతా ఈ పందెం రైతులు తనదైన శైలిలో పెంచుతూ ఉంటారు. కొన్ని కోడి పుంజులకు స్విమ్మింగ్, మరికొన్ని కోడి పుంజులకు ఎక్సర్సైజ్, వీటితో పాటు బాదంపప్పు, జీడిపప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ తో వాటిని ప్రత్యేకంగా పెంచుతూ ఈ పందాలకు సిద్ధం చేస్తారు.
ఇప్పటివరకు ఏసయ్య పుంజులే పందాల్లో కనిపించేవి. కాగా.. ఈసారి లాటిన్, అమెరికా దేశమైన పేరు చెందిన జాతి కోళ్లు కూడా ఉమ్మడి గోదావరి జిల్లా పందెం బరులో దిగేందుకు సిద్ధమయ్యాయి. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈసారి కోడిపందాల్లో కాలు దువ్వేందుకు రెడీ అవుతున్నారు. గతంలో భారత్ లో స్థానిక పుంజులను పందాల్లో ఉపయోగించేవారు. అయితే భారత్ కంటే మెరుగైన జాతి కోళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారంతో గుర్తించే పని స్థానిక పందెం పెంపకం దారులు ప్రయత్నిస్తున్నారు. కోనసీమలో పీక్ విమానాలు ద్వారా దిగుమతి చేసుకొని ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఫామ్స్ ఏర్పాటు చేసుకొని శిక్షణ ఇస్తున్నారు.
విదేశాలు నుంచి తీసుకొచ్చిన పిల్లల్ని కొన్ని పందాలు ఉపయోగిస్తుంటే మరికొన్ని క్రాసింగ్ కోసం వినియోగిస్తున్నారు తిరిగి ప్రత్యేక విధానంలో మేపుతున్నారు. పేరు జాతి కోళ్ళు ఒక్కో దాని విలువ మూడు లక్షల పైనే ఉంటుంది మరో 30000 వరకు ఖర్చు అవుతుంది వీటిని మేపి పందానికి సిద్ధం చేసేసరికి ఒక్కో పందెం పుంజు పై ఐదు లక్షల వరకు చేరుతుందని ఆత్రేయపురం చెందిన ముదునూరి రామకృష్ణ రాజు చెప్పారు.