తెలంగాణ
Kishan Reddy: కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Kishan Reddy: హైదరాబాద్ బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని ప్రార్థించానన్నారు కిషన్ రెడ్డి. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లాలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారత సైనికులకు మరింత ఆత్మస్థైర్యం కల్పించేలా సామూహిక ర్యాలీలు నిర్వహించి సంఘీభావాన్ని తెలపాలన్నారు.