తెలంగాణ
Kishan Reddy: ఎంతో మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చింది

Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఎంతో మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం అహింసా పద్ధతిలో సాగిందన్నారు.
ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ వచ్చాక నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగిందని విమర్శించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది. కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి కానీ.. యువతకు రాలేదు. ఏ ఆకాంక్షల కోసం ప్రజలు పోరాడారో గత పదేళ్లలో అవి నెరవేరలేదు.