తెలంగాణ
Kishan Reddy: ఢిల్లీలో ప్రదక్షిణ తప్ప.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గురివింద గింజలా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తన అసమర్ధతను కేంద్రం, బీజేపీ, ప్రధాని మోదీపై రుద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డితోపాటూ రాహుల్, సోనియా గాంధీ కూడా బాధ్యత వహించాలని కోరారు. నెలకు నాలుగుసార్లు ఢిల్లీలో ప్రదక్షిణ తప్ప 18 నెలల్లో తెలంగాణకి ఒరగ బెట్టింది ఏమీ లేదని కిషన్ రెడ్డి అన్నారు.



