సిద్-కియారా ఇంట కిలకిల!

Kiara Advani: బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులుగా మారారు. వీరికి పండంటి ఆడపిల్ల జన్మించగా, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ శుభవార్తను పంచుకున్న ఈ జంటకు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
బాలీవుడ్ లవ్బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. వీరికి ముంబైలోని ఎచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్లో ఆడపిల్ల జన్మించింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సంతోషకరమైన వార్తను ఇన్స్టాగ్రామ్లో ఓ పింక్ కార్డ్తో పంచుకున్న కియారా, సిద్ధార్థ్, “మా హృదయాలు నిండిపోయాయి, మా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది” అని రాసుకొచ్చారు.
2023లో రాజస్థాన్లో వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గర్భవార్తను ప్రకటించిన వీరు, బేబీ సాక్స్తో కూడిన ఫొటోను షేర్ చేశారు. సిద్ధార్థ్ తల్లిదండ్రులు హాస్పిటల్కు చేరుకుని మనవరాలిని చూసేందుకు వచ్చారు. ఈ జంటకు అభిమానులతో పాటు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.