జాతియం
నేడు అహ్మదాబాద్కు ఖర్గే, రాహుల్గాంధీ

నేడు అహ్మదాబాద్కు ఖర్గే, రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు. ఘటనపై రాహుల్ గాంధీ ఆరా తీయనున్నారు. ఇక విమాన ప్రమాదంలో ఇప్పటికే 241 మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.