తెలంగాణ
Khammam: భారీగా రేషన్ బియ్యం పట్టివేత..

Khammam: ఖమ్మం జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. పోలీసులు, రాజ్ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది.
తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెంలో 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.