ఖలేజా రీరిలీజ్: ఫ్యాన్స్కు ఊహించని షాక్!

Khaleja: సూపర్స్టార్ మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా త్రివిక్రమ్ రూపొందించిన ‘ఖలేజా’ సినిమా రీరిలీజ్తో సంచలనం సృష్టించింది. అయితే, థియేటర్లలో ఊహించని ట్విస్ట్తో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. సినిమాలో కొన్ని సీన్స్, సాంగ్స్ కట్ చేయడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సూపర్స్టార్ మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ‘ఖలేజా’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, ఆ తర్వాత కల్ట్ క్లాసిక్గా మారింది. ఈ నేపథ్యంలో రీరిలీజ్తో ప్రపంచవ్యాప్తంగా భారీ బుకింగ్స్ సాధించి, ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలతో థియేటర్లలోకి వచ్చింది.
అయితే, సినిమాలో కీలక సన్నివేశాలు, పాటలు తొలగించడంతో ఫ్యాన్స్కు షాక్ తగిలింది. ఈ విషయంపై థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదాలు కూడా జరిగాయి. ప్రింట్ అలానే వచ్చిందని థియేటర్ సిబ్బంది వాదిస్తుండగా, ఫ్యాన్స్ మాత్రం నిరాశతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చిన అభిమానులకు ‘ఖలేజా’ పూర్తి వినోదాన్ని అందించలేకపోయిందని చెప్పక తప్పదు.