తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఖైరతాబాద్ గణేష్ అడ్హాక్ కమిటీ

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ గణేష్ అడ్హాక్ కమిటీ కలిశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి నవరాత్రి ఉత్సవాలకు సీఎంను అడ్హాక్ కమిటీ ఆహ్వానించింది. రేవంత్రెడ్డిని బాలాపూర్ గణేష్ నవరాత్రి వేడుకులకు ఉత్సవ సమితి ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.



