కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో.. ఫేక్ పోస్టులపై లోతుగా కొనసాగుతున్న దర్యాప్తు

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో..ఫేక్ పోస్టులపై దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది. ఫేక్ వీడియోలు పెట్టిన పలువురిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా AI ఫేక్ పోస్టులపై పోలీసులు నిఘా పెట్టడంతో పలువురు సెలబ్రిటీలు పోస్టులను డిలీట్ చేశారు.
ప్రధానంగా వీడియోలు పెట్టి వైరల్ చేసి డిలీట్ చేసినవారి వివరాలు సేకరిస్తున్నారు. మా ర్చి 31నుంచి ఏప్రిల్ 2తేదీల మధ్య ఫేక్ పోస్ట్లు హల్చల్ చేసినట్లు నిర్ధారించారు. రంగంలోకి దిగన పోలీసులు సోషల్ మీడియా ఖాతా URLతో సహా వారి వివరాలను సేకరించారు.
అదేవిధంగా ఇంకా ఫేక్ పోస్ట్లను తొలగించని వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 25మంది సెలబ్రిటీలు పోస్టులు తొలగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గచ్చిబౌలి పీఎస్ ఎదుట విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మన్నె క్రిశాంక్ను విచారిస్తున్నారు పోలీసులు.