News
Kakinada Port Scam: రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరిచ్చారు..

Kakinada Port Scam: రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరిచ్చారు..ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వ్యవహారంలో.. ఇద్దరికీ నోటీసులు ఇష్యూ చేసింది. అయితే.. గతంలో పార్లమెంట్ సమావేశాల పేరుతో విజయసాయిరెడ్డి,.. అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి.. విచారణకు డుమ్మా కొట్టారు.
మరోవైపు.. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఇప్పటికే.. ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనకు మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.