ఆంధ్ర ప్రదేశ్
Kakinada: కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Kakinada: కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ గేట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబళ్ల పై నుంచి గంజాయి స్మగ్లర్ల కారు దూసుకెళ్లింది. తనిఖీల్లో భాగంగా కారు ఆపిన పోలీసులపై నుంచి కారు దూసుకెళ్లింది. కారు ఆపుతున్నట్టు నటించి వేగంగా ముందుకు నడిపారు డ్రైవర్. ఈ ఘటనలో కారు ముందున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. రాజానగరం కెనాల్ రోడ్డులో కారును వదిలి డ్రైవర్ పరారీ అయినట్టు సమాచారం. కారు యూపీకి చెందినదిగా గుర్తించారు.