Newsఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టుకు కాకాణి

నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తరలించారు. తొలుత స్థానిక పీహెచ్సీలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అంతకుముందు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకాణిని విచారించారు పోలీసులు.
నిన్న బెంగళూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి నెల్లూరుకు తరలించారు. కాగా అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాణి. రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు.