ఆంధ్ర ప్రదేశ్
నేడు రెండోరోజు పోలీస్ కస్టడీకి కాకాణి

Kakani: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీ నేడు రెండోరోజుకు చేరుకుంది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు పీఎస్లోనే కాకాణి ఉన్నాడు. అయితే కాకాణిని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస రావు విచారిస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. కాగా విచారణ ముగిసే వరకు పీఎస్లోనే ఉండనున్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
అయితే నిన్న మొదటి రోజు విచారణలో భాగంగా కాకాణి తనకు ఏమీ తెలియదు, సంబంధం లేదు, తమ లాయర్ని అడగాలంటూ డీఎస్పీకి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు సహకరించడం లేదనే టాక్ వినబడుతోంది.