ఆంధ్ర ప్రదేశ్
Kakani: వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది

Kakani: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఫైరయ్యారు. వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని ఆయన మండిపడ్డారు. టీడీపీ నాయకుల బిల్డింగ్స్ వదిలేసి..వైసీపీ నేతల కట్టడాలే లక్ష్యంగా కూల్చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి నారాయణ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు.
ఈ విషయాన్ని అధికారులు, టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని కాకాణి హెచ్చరించారు. నష్టపోయిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలపై మంత్రి నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు.