తెలంగాణ
Kadiyam Kavya: ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పే సమయం వస్తుంది

Kadiyam Kavya: బీజేపీపై వరంగల్ ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు. దేశంలో గాంధీ కుటుంబానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని కావ్య విమర్శించారు. గాంధీ కుటుంబంపై కేంద్రం ఈడీతో అక్రమ కేసులు పెట్టించి వేధించాలని చూస్తుందన్నారు. ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పే సమయం వస్తుందని ఎంపీ కడియం కావ్య తెలిపారు. సోనియా, రాహుల్పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం అంటున్న వరంగల్ ఎంపీ కడియం కావ్య.