ఆంధ్ర ప్రదేశ్
Kadapa: విషాదం.. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య..

Kadapa: కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అప్పుల బాధతో భార్య, ఇద్దరు పిల్లలతో రైతు నాగేంద్ర ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో భర్త నాగేంద్ర, భార్య వాణి, కుమారుడు భార్గవ్, కుమార్తె గాయత్రి ఉన్నారు.