తెలంగాణ
Jupally Krishna Rao: SLBC పై దురుద్దేశంతోనే హరీష్ రావు విమర్శలు

Jupally Krishna Rao: ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే హరీశ్రావు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎందుకు పెండింగ్ పెట్టిందని ప్రశ్నించారు.
ప్రకృతి విపత్తులనూ బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని మండి పడ్డారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్లో చిక్కుకున్న 8 మంది బతికే అవకాశం లేదు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పనులు చేపట్టిన సంస్థ ప్రతినిధులు అప్రమత్తం చేసి ఉండకపోతే 40 మంది వరకు కార్మికులు చనిపోయేవారు అని మంత్రి పేర్కొన్నారు.