తెలంగాణ
Revanth Reddy: వివిధ సంక్షేమ విభాగాలతో సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వివిధ సంక్షేమ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఇక ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.



