తెలంగాణ
Hyderabad: జేఎన్టీయూలో హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన

Hyderabad: హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో తమ జీతాలను పెంచాలని హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలని హౌస్ కీపింగ్ సిబ్బంది విధులను బహిష్కరించారు. రెండేళ్లుగా పోరాడుతున్న జీతాలు పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని హౌస్ కీపింగ్ సిబ్బంది మండిపడుతున్నారు. కార్మిక చట్టం ప్రకారం హౌస్ కీపింగ్ సిబ్బందికి 21వేల వేతనం ఇవ్వాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.