జాతియం

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల

విద్యార్థులు ఆసక్తి ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్షా బాధ్యతలను చేపట్టిన ఐఐటీ కాన్పుర్‌ తుది ఫలితాలను వెల్లడించింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఐఐటీ కాన్పూర్ అధికారిక వైబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్ , బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ , అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా మొత్తం 1.80 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యారు.జూన్‌ 3 సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లుగా ఐఐటీ కాన్పుర్‌ ఇప్పటికే షెడ్యూల్‌ రిలీజ్ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button