ఆంధ్ర ప్రదేశ్

డిప్యూటీ మేయర్ పీఠం కూటమి కైవసం

GVMC డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. 64వ డివిజన్‌కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 59 మంది సభ్యుల కోరంతో సమావేశం నిర్వహించగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు.

GVMC డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం కావటంతో కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడం కోసం ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. మేయర్ ఎన్నిక తర్వాత లైట్స్, రోడ్లు వేశామని తెలిపారు. కూటమి పాలనలోనే విశాఖ అభివృద్ధి సాధ్యమంటున్న ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పళ్ల శ్రీనివాస్ రావు.

కూటమిలో ఓటమి ఉండదంటున్నారు టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు. ప్రజలకు మంచి చేయడానికి సేనాని అడుగుజాడల్లో ముందుకు వెళ్తామంటున్నారు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి. కూటమి విజయంపై యలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమంటున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button