తెలంగాణ

Jagga Reddy: దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుంది

Jagga Reddy: దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుందని… పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని, ఆ పార్టీకి గత లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పొరపాటున 8 ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వబోమని సంజయ్ బెదిరిస్తున్నారని అన్నారు. బండి సంజయ్ నీ ఊరికే వస్తా.. ఇందిరమ్మ గురించి ఓ ముసలమ్మను అడుగుదాం.. ఏం చెబుతుందో చూద్దామని సవాల్ విసిరారు. బీజేపీ విలువలతో కూడిన రాజకీయం చేయడం లేదని మండిపడ్డారు. ఇందిరాను విమర్శించడంపై సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button