ఆంధ్ర ప్రదేశ్

నేడు వంశీని పరామర్శించనున్న జగన్

Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. విజయవాడ గాంధీనగర్‌ జైలులో ఉన్న వంశీతో నేడు జగన్ ములాఖత్ కానున్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ-ఎస్టీ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే ఐదుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో విజయవాడ జైలుకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ జైలులోనే వల్లభనేని వంశీ ఉన్నారు.

ఇక వల్లభనేని వంశీ కేసులో మిగితా నిందితులు విదేశాలు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనుచరులు కొమ్మ కోట్ల, రంగాతో పాటు.. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇదే కేసులో కిడ్నాపర్ కారుతో పాటు మొబైల్‌ను సీజ్ చేశారు. హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ నేడు విచారణకు వచ్చే అవకాశం కన్పిస్తోంది.

అలాగే ఇవాళ వల్లభనేని వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు ఎస్సీ-ఎస్టీ కోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇరుపక్షాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే జైలులో ప్రత్యేక వసతికి అనుమతి ఇవ్వాలని వంశీ తన పిటిషన్‌లో పేర్కొనట్లు సమాచారం.

మరోవైపు వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపై కృష్ణా జిల్లా పోలీసుల ఫోకస్ పెట్టారు. గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు.. హనుమాన్ జంక్షన్‍లో షాపుల కూల్చివేత కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో జరిగిన కేసులోనూ వంశీని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. వంశీ నిందితుడుగా ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. నూజివీడు, గన్నవరం కోర్టుల్లో పీటీ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button