ఆంధ్ర ప్రదేశ్

Jagan: వంశీపై తప్పుడు కేసులు పెట్టారు

Jagan: ఏపీలోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. వంశీ మీద కోపం, ఆక్రోశంతోనే కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో తప్పులు కేసులు పెట్టారని ఆరోపించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న జగన్ తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమన్నారు. ఇంతకు ఇంత అనుభవిస్తారన్న జగన్.. తప్పు చేసిన పోలీసులు రిటైరైనా కూడా వదలిపెట్టమని హెచ్చరించారు.

అంతకుముందు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్న వైఎస్ జగన్ వల్లభనేని వంశీని పరామర్శించారు. అలాగే వంశీ భార్య పంకజశ్రీ కూడా వంశీతో ములాఖత్ అయ్యారు. జగన్ వెనక కొడాలి నాని, పేర్నినాని కూడా వెళ్లి వంశీని పరామర్శించారు. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. జగన్ రాకతో జైలు సమీపంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button