ఆంధ్ర ప్రదేశ్

Jagan: 3-4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మనమే

Jagan: ఏపీలో వైసీపీ 15వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ ఆవిర్భవించిందన్నారు వైఎస్ జగన్. ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం తమకు కొత్తకాదన్న జగన్. 3-4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకుండా బకాయిలు పెట్టారని విద్యాదీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారంటూ విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని జగన్ ఆరోపణలు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button