తెలంగాణ
Jagadish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది

Jagadish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మంత్రులు పోలీసులను అడ్డు పెట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. ప్రజల్లో తిరుగుబాటు తట్టుకోలేక బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయినట్టు తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు రేవంత్ కూడా పారిపోవాల్సి వస్తుందన్నారు.
ప్రజా వ్యతిరేకతతో మంత్రులు గాల్లో తిరిగే వారు గాల్లోనే కలిసిపోతారన్నారు. వరంగల్లో జరగబోయేది బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు. రేవంత్రెడ్డి మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభ అని అన్నారు.