తెలంగాణ

మాదాపూర్‌లో భవనంపై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

Madhapur: అనారోగ్య సమస్యతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగలోకి వచ్చింది. ఈ ఘటన మాదాపూర్‌ పీఎస్‌పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన రిటోజ బసు అనే యువతి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌ మాదాపూర్‌లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటుంది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది.

ఈనెల 3న తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button