తెలంగాణ
మాదాపూర్లో భవనంపై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

Madhapur: అనారోగ్య సమస్యతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగలోకి వచ్చింది. ఈ ఘటన మాదాపూర్ పీఎస్పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్కు చెందిన రిటోజ బసు అనే యువతి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ మాదాపూర్లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటుంది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది.
ఈనెల 3న తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.