అంతర్జాతీయం
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముగిసిన యుద్ధం

ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ తాజాగా వెల్లడించింది. ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరంపై తాము చేసిన దాడి విజయవంతమైందని పేర్కొంది.
ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారని, కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడ్డారని తెలిపింది. తమ దేశం జరిపిన దాడి అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కోసం వేడుకున్నారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెహ్రాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేసింది.