ఆంధ్ర ప్రదేశ్

Jagan: జగన్ జైలుకు అడుగు దూరంలో ఉన్నారా..?

Jagan: రెడ్ బుక్.. ఈ మాట ఏపీ పాలిటిక్స్ లో బాగా పాపులర్ అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను వేధించిన వైసీపీ నేతలందరినీ టార్గెట్ చేస్తూ వారి పేర్లను రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నానని, అధికారంలోకి వచ్చాక అందరి అకౌంట్ సెటిల్ చేస్తానని మంత్రి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ అప్పట్లో చినబాబు వార్నింగ్ ను లైట్ తీసుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వైసీపీ నేతలంతా లోకేష్ పై సెటైర్లు వేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో లోకేష్ అన్నంత పని చేశారు. రెడ్ బుక్ లో నోట్ చేసిన వాళ్లందరకీ గత ఏడాది కాలంగా చిన్నబాబు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం వైసీపీ లీడర్లే కాదు, సోషల్ మీడియా నిర్వాకులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్న వారి భరతం పట్టాలన్న పంతం నెగ్గించుకున్నాడు. ఈ రెడ్ బుక్ లోకి ఎక్కిన వారిలో వల్లభనేని వంశీ పరిస్ధితి ఇప్పుడు ఎంత దారుణంగా తయారయ్యిందో చూశాక వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది.

వంశీతో పాటూ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామ ఆంజనేయులు కూడా అరెస్ట్ కావడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అంతటితో ఆగకుండా లిక్కర్ స్కాంలో వైసీపీ అధినేత జగన్ కుడి భుజంగా చక్రం తిప్పిన రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయరెడ్డి, మరో అధికారి కృష్ణమోహన్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వైసీసీ నేతలకు దిక్కు తోచడం లేదు.

లోకేష్ రెడ్ బుక్ లో నోట్ చేసుకున్న మిగిలిన పేర్లన్నీ ఒక ఎత్తైతే ఇందులో ముఖ్యంగా నోట్ చేసుకున్న కింగ్ పిన్ పేరుపై ఎవరికీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఆ కింగ్ పిన్ జగనే అని అందరికీ తెలుసు. జగన్ మీద లోకేష్ కు ఉన్న కసి, అంతా ఇంతా కాదు. ఏపీ ప్రజలు ఎప్పుడూ చూడలేరనుకున్న రెండు విషయాలు జగన్ వల్ల జరిగాయన్న ఆక్రోశం లోకేష్ లో మిగిలిపోయింది.

మచ్చలేని నేతగా 40 ఏళ్లు రాజకీయం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసుల్లో ఇరికించేందుకు వైఎస్సార్ వంటి నేతలు వేసిన ఉచ్చు నుంచి సునాయసంగా తప్పించుకోగలిగారు. ప్రధాని మోదీపై తిరగబడినా కేంద్రం కూడా చంద్రబాబును ఏ కేసులోనూ ఇరికించలేక పోయింది. ఇలా ప్రత్యర్ధులకు దొరకకుండా తప్పించుకున్న చంద్రబాబును స్కిల్ డెవలెప్ మెంట్ స్కాం పేరుతో అరెస్ట్ చేసి, యాభై రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించడాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోయారు.

అప్పటి వరకు రాజకీయంగా జగన్ పై ఉన్న ప్రతీకారం వ్యక్తిగతంగా మారడంతో జగన్ కు చుక్కలు చూపించాలని చిన్నబాబు డిసైడ్ అయ్యాడు. అందుకే ఇప్పుడు లిక్కర్ స్కాంలో జగన్ ను జైలుకు పంపడానికి ముహూర్త్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది.

జగన్ హయాంలో అన్నింటికన్నా పెద్ద స్కాం లిక్కర్ అమ్మకాల్లో జరిగిందని టీడీపీ నేతలు మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ ఆరోపణల ఆధారంగానే ఇప్పుడు జగన్ ను కటకటాల వెనక్కి పంపాలన్నది లోకేష్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ విషయంలో చట్ట పరంగానే కాకుండా ప్రధాని మోదీ నుంచి కూడా లోకేష్ గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకెళ్లిన లోకేష్ మోదీతో ఏకాంతంగా జరిపిన చర్చల్లో జగన్ అరెస్ట్ గురించి ఎక్కువగా ఫోకస్ చేశారని బీజేపీ వర్గాల సమాచారం.

అనుకున్న ప్లాన్ యథాతథంగా అమలైతే మరో 15 రోజుల్లోపు లిక్కర్ స్కాంలో జగన్ అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో చంద్రబాబును బంధించిన సెల్ లోనే జగన్ ను కూడా రిమాండ్ లో ఉంచాలన్నది లోకేష్ స్కెచ్ అని టీడీపీ వర్గాల సమాచారం. ఒక్కసారి జగన్ జైలుకు వెళ్తే ఇక వరుసబెట్టి, వేరే కేసుల్లో ఇరికించి, ముప్పుతిప్పలు పెట్టే విధంగా స్క్రీన్ ప్లే రెడీ అయిపోయిందని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే వైసీపీలో చెట్టుకొకరు అన్న చందంగా జిల్లాల పరిస్ధితి మారిపోయిందని, ఇక జగన్ జైల్లో నెలల కొద్దీ ఉండాల్సి వస్తే ఆ పార్టీ పరిస్ధితి దయనీయంగా మారుతుందని సైకిల్ పార్టీ నేతలు జోశ్యం చెబుతున్నారు. జగన్ కు రాజకీయ వేధింపులు, అరెస్ట్ లు, జైలు జీవితం కొత్త కాకపోవచ్చు గతంలో ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కుని సీఎం అయ్యారు కానీ గతంతో పోలిస్తే ఇప్పటి పరిస్ధితులకు చాలా తేడా ఉంది.

అప్పట్లో జగన్ వెనుకు బలమైన క్యాడెర్, అనుభవమున్న నేతలు ఉండేవారు. కానీ గత ఐదేళ్లలో వైసీపీ క్యాడెర్ నిర్వీర్యమై పోయింది. చాలా మంది సీనియర్ నేతలు వేరే పార్టీల్లోకి వలస వెళ్లపోయారు. మరి ఈ ప్రతికూల వాతావరణం నేపధ్యంలో లోకేష్ గండం నుంచి జగన్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button