ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం స్వామి-అమ్మవార్ల దర్శన టికెట్లలో అక్రమాలు

Srisailam: శ్రీశైలం స్వామి-అమ్మవార్ల దర్శన టికెట్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నకిలీ టికెట్లతో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నట్లు తేలింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. దేవస్థా నం టికెట్లను ట్యాంపరింగ్ చేసి భక్తులకు విక్రయించారు. దేవస్థానం సీల్ తయారు చేసి మరీ.. పాత టికెట్లతో దందా చేస్తున్నారు. ఇంతా తెలిసిన కూడా రిపోర్టు ఇవ్వకుండా క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షకురాలు హిమబింధు జాప్యం చేస్తున్నారు.
టికెట్ల అక్రమాల్లో కొందరి అధికారుల పాత్ర ఉందని తెలుస్తుంది. అందుకే టికెట్ల విచారణలో జాప్యం జరుగుతుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరిలో కూడా క్యూలైన్ల వద్ద నకిలీ దర్శనం టికెట్లు పట్టుబడ్డాయి. ఇక నకిలీ దర్శనం టికెట్లపై ఆలయ అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.