ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైల దేవస్థానంలో అక్రమాలు

Srisailam: శ్రీశైల దేవస్థానంలో అక్రమాలు జరిగాయి. కుర్చీ ఖర్చులు సైతం మింగిన వైనం వెలుగులోకి వచ్చింది. నాణ్యత లేని కుర్చీలను సంబంధిత ఇంజినీర్లు కొనుగోలు చేశారు. దీంతో కాంట్రాక్ట్ ఏఈపై.. ఈవో శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు.
ఫిబ్రవరిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు 40లక్షల రూపాయలతో ఎయిర్పోర్ట్ కుర్చీలు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఆకుర్చీలు నాణ్యత లేకపోవడంతో విరిగిపోయే స్థితిలో ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఈవో శ్రీనివాసరావు, ఈ నెల 4న ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమాలు జరిగాయని గుర్తించి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.