అంతర్జాతీయం

Khamenei: ‘యుద్ధం మొద‌లైంది’.. ఖ‌మేనీ సంచ‌ల‌న పోస్ట్‌!

Ali Khamenei: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ఆందోళనలను రెట్టింపు చేసింది. యుద్ధం మొదలైంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుండటంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేసారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ప్రస్తుతం ఆయనను అంతమొందించే ఉద్దేశం లేదని ట్రంప్ పేర్కొన్నారు. తక్షణమే బేషరతుగా లొంగిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఈ హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఖమేనీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించారు. యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్ ఖడ్గంతో ఖైబర్‌కు చేరుకున్నారని ఆ పోస్టులో ఖమేనీ పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు ఖడ్గం ధరించి కోట ద్వారం వద్ద నిలబడిన ఒక వ్యక్తి చిత్రాన్ని కూడా జతచేశారు.

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై తాము హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button