క్రీడలు

IPL 2025: త్వరలో IPL-2025 పునఃప్రారంభం..?

IPL 2025: త్వరలో IPL-2025 పునఃప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ఈ నెల 16 లేదా 17న షురూ అయ్యే అవకాశం కనబడుతోంది. షెడ్యూల్ సిద్దం చేసే పనిలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఆటగాళ్లను వెనక్కి పిలవాలని ప్రాంఛైజీలతో బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తుంది. ఇక జూన్ 1న ఐపీఎల్ ఫైనల్ జరిగే అవకాశం ఉంది.

టోర్నీలో 16 మ్యాచ్‌లను హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాతోపాటు బెంగళూరులో నిర్వహించే అవకాశం కన్పిస్తోంది. ఇక ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్ నిష్క్రమించాయి. చెప్పాలంటే కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్ మ్యాచ్‌ల పునఃప్రారంభానికి మార్గం సుగమం అయింది.

ఇదిలా ఉండగా టోర్నీ తిరిగి ప్రారంభం కావడం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందంటోంది బీసీసీఐ. కాగా టోర్నీ పునరుద్ధరణపై ఐపీఎల్ పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరగాయని టాక్ వినబడుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button