క్రీడలు

RR vs MI: నేడు ఐపీఎల్‌లో ముంబై వర్సెస్ రాజస్థాన్

RR vs MI: ఐపీఎల్ లో మ్యాచ్ లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక ప్లే ఆఫ్ కు నాలుగు జట్లు మాత్రమే మిగులుతాయి. ఇప్పటికే కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్లగా కొన్ని జట్లు మాత్రం ఇంకా రేసులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అయితే ఏ జట్లు చివరకు మిగులుతాయన్నది చెప్పకపోయినా ఫేవరెట్ జట్లు మిగలాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో పాటు ముంబయి ఇండియన్స్ జట్లు రెండు ప్లే ఆఫ్ రేసులోకి రావాలని ఎక్కువ మంది ఆంకాక్షిస్తున్నారు.

ఇవాళ ఐపీఎల్‌లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకూ 10 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ లలో గెలిచి 4 మ్యాచ్ లలో ఓటమి పాలయింది. పన్నెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకూ 10 మ్యాచ్ లు ఆడితే అందులో 3మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఏడు మ్యాచ్ లలో ఓడింది. పాయింట్ల పట్టికలో చివరలో ఉంది. మ్యాచ్ జైపూర్ లో జరుగుతుండటంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button