క్రీడలు

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి మ్యాచ్ నేడు

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఇవాళ బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో ఈ రెండు జట్లు సెమీ ఫైనల్స్‌లో తలపడగా భారత్ ఘన విజయం సాధించింది. టీ20 వరల్డ్‌కప్ విజయంతో మరోసారి ఐసీసీ ఈవెంట్స్‌లోకి భారత్ అడుగుపెట్టింది. ఐసీసీ ఈవెంట్లలో వరుసగా ఫైనల్స్‌కు చేరుకున్న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button