India: 2028కి భారత్ జర్మనీని వెనక్కి నెట్టి మూడో స్థానంలోకి?

India: భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిపోతోంది. ఇన్నాళ్లూ, ఇండియా అంటే అదీ, ఇదీ అని చాన్నాళ్లూగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇండియా అప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చెందుతుందన్న మాటలు వినీ వినీ అలసిపోయాం. కానీ ఇండియా ఇప్పుడు దూసుకుపోతోంది. జగజ్జేతగా ఆవిర్భావిస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. ఒకప్పుడు అమెరికాకో, చైనా వైపో మనం చూసేవాళ్లం.
ఇప్పుడు ప్రపంచం చూపే మనవైపు పడుతుంది. భారత్ అభివృద్ధి చెందుతున్న మాట నుంచి ప్రపంచ శక్తిగా మారుతోందన్న మాట వినిపిస్తోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే కాదు ప్రపంచానికి కొత్త సవాళ్లు విసురుతోంది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత ఇప్పుడు భారత్ నిలిచింది. జపాన్ను వెనక్కి నెట్టిన ఇండియా త్వరలో జర్మనీ స్థానంలోకి దూసుకెళ్లనుంది. ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ జీడీపీ ప్రస్తుతం 4.19 ట్రిలియన్ డాలర్లు.
ఓవైపు గ్లోబల్ సంక్షోభం మరోవైపు భారత్ దూకుడు ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాల వల్ల చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడ్డాయి. అమెరికా, జపాన్, జర్మనీల వృద్ధి మందగించింది. కానీ భారత్ మాత్రం దూసుకుపోతోంది. ప్రధాని మోడీ నాయకత్వంలో కీలక రంగాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక వ్యూహాలు, డిజిటలైజేషన్, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం వల్ల వృద్ధి సాధ్యమైంది. 2023లో మోడీ భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందన్న మాటలు నిజమయ్యేలా తాజా పరిణామాలు కన్పిస్తున్నాయి.