క్రీడలు

U-19 World Cup: అండర్‌ 19 ప్రపంచకప్‌.. చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ

U-19 World Cup: ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2025లో భారత ఓపెనర్‌ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌ రికార్డు నెలకొల్పింది. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది. కాగా.. 19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌తో పాటు రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలింగ్‌ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button