జాతియం

India: ఆపరేషన్ సిందూర్‌తో చరిత్ర సృష్టించిన భారత్

India: యుద్ధం చేయాలంటే ప్రత్యర్థికి కన్పించి చేయాల్సిన పనిలేదు. ప్రత్యర్థి ముందుకు వెళ్లి రొమ్ము చీల్చి యుద్ధం చేయాల్సిన అవసరమే లేదని తాజాగా ఇండియా సాగించిన యుద్ధం ఎలుగెత్తి చాటింది. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌ను పంబరేగ్గొట్టింది. ఆ దేశం ఊహించని విధంగా వైమానిక దాడులతో కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. దాడులు ఎలా చేశారో కూడా అర్థంకానంతగా ఇండియా దాయాది వెన్ను విరిచింది.

ఈ దాడులతో ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే కాదు అమెరికా, చైనాకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫర్ట్ ఇది ఇండియా ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ భూభాగాలపై చేసిన దాడులకు సంబంధించిన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తం దాడులు అసాధారణ సినర్జీతో చేసినవిగా తాజాగా కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇండియా దూకుడుతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. ఓవైపు సైనికేతర దాడులతో కంగారుపెట్టించిన ఇండియా ఆ తర్వాత చేసిన దాడులతో వణికిపోయింది. గగ్గోలు పెట్టాల్సిన దుస్థితికి చేరుకుంది. ఇండియా పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ ద్వారా సాగించిన యుద్ధం ఏ రేంజ్‌లో సాగిందో తెలుసుకుంటో షాక్ అవుతాం.

దేశీయంగా రూపొందించుకున్న ఆయుధాలు, క్షిపణలు, ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఎలా ముందుకు నడిపించాయన్నది తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సైనిక సిబ్బందితో పాటు నిరాయుధులను టార్గెట్ చేసింది. కంటికి కన్పించని యుద్ధం ఇండియా చేసింది. నాడు బలగాలు చేసిన దాడిని ఇండియా వివరించింది. ఆపరేషన్ సిందూర్ వ్యూహాత్మక ప్రతిభ పాకిస్తాన్‌లోని ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాద కేంద్రాన్ని భారతదేశం దాడి చేయగలదని నిరూపించింది. దేశీయ హైటెక్ వ్యవస్థలను జాతిరక్షణలో సజావుగా అనుసంధానించింది.

డ్రోన్ యుద్ధంలో, లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్‌, ఎలక్ట్రానిక్ యుద్ధంలో అయినా, ఆపరేషన్ సిందూర్ సైనిక కార్యకలాపాలలో సాంకేతిక స్వావలంబన వైపు భారతదేశ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచాయి. ఆపరేషన్ సిందూర్ సైనిక సిబ్బందితో పాటు నిరాయుధ పౌరులను కూడా ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న అసమాన యుద్ధానికి కొలమానంగా నిలిచాయి. సైనిక ప్రతిస్పందనగా ఉద్భవించిందని ప్రభుత్వం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్‌లో పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా దూకుడు పెంచింది. భయంకరమైన జ్ఞాపకంగా సిందూర్ దాడులు పనిచేశాయి. భారతదేశ ప్రతిస్పందన ఉద్దేశపూర్వకంగా, కచ్చితమైనదిగా వ్యూహాత్మకంగా ఉంది. నియంత్రణ రేఖ లేదా అంతర్జాతీయ సరిహద్దును దాటకుండానే, భారత దళాలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసి అనేక టార్గెట్‌లను ధ్వంసం చేశాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

పాకిస్తాన్ యుద్ధం విషయంలో ఇండియా అనుసరించిన వ్యూహం, మొత్తంగా ప్రపంచానికి షాక్ కలిగించింది. ఇండియా ఏంటి ఇంతలా దూకుడు ప్రదర్శించడమేంటని ఆయా దేశాలు కలవరపడుతున్నాయ్. ఇండియా ఎటాక్స్ తో అందుకే అమెరికా అంత కంగారుపడింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు అసలు సేఫ్ గా ఉన్నాయో లేవోనన్న కంగారు ఇప్పుడు అగ్రదేశాన్ని వెంటాడుతోంది.

ఇండియా అంటే సామాన్యం కాదని అమెరికాకు అర్థమైపోయింది. అందుకు యుద్ధాన్ని ఆపాలాంటూ చర్చల మీద చర్చలు జరిపింది. చైనా సైతం వచ్చే రోజుల్లో ఇండియాతో పెట్టుకుంటే ఇబ్బందులొస్తాయోమోనన్న కంగారుపడుతోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఇండియా చేసిన దాడులతో బిక్కచచ్చి బావురుమంటోంది. పైకి గంభీర ప్రకటనలు చేసినప్పటికీ, తమ పనైపోయిందని పాకిస్తాన్ కు ఆపరేషన్ సిందూర్ అర్థమయ్యేలా చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button