News
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండల తీవ్రత

Summer Effect: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం పది దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటికి వెళ్లలేకపోతున్నారు. పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీ, తెంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.