ఆంధ్ర ప్రదేశ్
కాకినాడలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 100 బస్తాలు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు సివిల్ సప్లై గుడౌన్కు తరలించారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు 9 లక్షల 30 వేలు ఉంటుందని తెలిపారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న మన్యం తేజ. వ్యాన్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.



