తెలంగాణ
మేడ్చల్లో కొనసాగుతున్న కూల్చివేతలు

మేడ్చల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు నడుస్తోం ది. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సర్వే నెంబరులు 1, 12లోని స్మశాన వాటికలను కబ్జా చేసి అమ్మేశారు కబ్జాదారులు.
అదేవిధంగా నిన్నసేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా సిబ్బంది. నిన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణలపై హైడ్రా సిబ్బంది ఉక్కుపాదం మోపింది. హైడ్రా అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.