తెలంగాణ
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. చార్జీలు పెంపు..

Hyderabad Metro: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. మెట్రో రైల్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి సంస్థ నిర్ణయం తీసుకుంది. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. ప్రయాణ దూరాన్ని బట్టి మిగతా మధ్యస్థ ఛార్జీలు కూడా మారాయి.
నాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు, 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు, 24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది.